ఆయిల్ & గ్యాస్

వచ్చే వారం లోపెట్రోల్ మరియు డిజిల్ ధరలు రూ. 5 పెంచనున్న ప్రభుత్వం

ప్రభుత్వం మరోసారి పెట్రోల్ మరియు డిజిల్ ధరలు పెంచేందుకు రంగం సిద్దం చేసుకుంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల రిత్యా ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఎన్నికలు అయిపో యినందున ధరలు పెంచేందుకు సిద్దం చేసుకుంది.దీనితో మరోసారి వినియోగదారుని పై భారం మోపేందుకు సిద్దం అయింది.ఎప్పటి వరకు వున్నా డిజిల్ ,మరియు పెట్రోల్ ధరలకు అదనంగా ప్రభుత్వం రూ. 5  పెంచనున్నట్లు ప్రకటించడం  జరిగింది. మే నెల 10  వ తేది తో ఎన్నికలు అయిపో తుండడం తో ప్రపంచం లో ముడి చమురు ధరలు ఆకాశాని అంటడంతో ధరలు పెంచక తప్పడం లేదని ప్రభుత్వం భావిస్తుంది. వంట గ్యాస్,కిరోసిన్  పై కూడా ప్రభుత్వం తో చర్చలు జరిపాక ధరలు పెంచేది, పెంచలేనిది తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది .ఏది వరకే గత ఏడాది జులై నెలలో పెంచిన సంగతి తెలిసిందే.

 

ఆర్‌సిపురం భెల్‌లో 250 మెగావాట్ల గ్యాస్ టర్బైన్

బిహెచ్ఇఎల్ హైదరాబాద్ యూనిట్ 2010-2011 ఆర్థిక సంవత్సరంలో 6651 కోట్ల టర్నోవర్‌ను సాధించే అవకాశం ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భెల్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ టర్బైన్ తయారు చేసి విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసింది. 400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భారీ ఫ్రేమ్-9 ఎఫ్ఎ టె స్టింగ్ యూనిట్‌లో పరీక్షలు నిర్వహించినట్టుగా కంపెనీ ఇడి కృష్ణన్ తెలిపారు.

ఇంతటీ భారీ గ్యాస్ టర్బైన్ తయారు చేసి రాంచంద్రపూరం యూనిట్‌లోనే ఇది ప్రథమమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 116 కోట్ల విలువైన 235 మెగావాట్ల మెషీన్ ఒకటి పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రతి యేటా నాలుగు భారీ గ్యాస్ టర్బైన్‌లను తయారు చేసే సామర్థ్యం భెల్ (ఆర్‌సిపురం) యూనిట్‌కు ఉందని వెల్లడించారు. రాబోవు ఆర్థిక సంవత్సరంలో 15 వేల మెగావాట్ల సామర్థ్యం గల టర్బైన్‌లను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

 

బి పి సి ఎల్ విదేశీ విభాగం తో బాగస్వామ్యం కోరుతున్న గెయిల్

బి పి సి ఎల్ విదేశీ విభాగంతో కలసి పనిచేయటానికి గెయిల్ సంసిద్దత వ్యక్తం చేసింది. ముఖ్యంగా  మొజాంబిక్ లోని  రోవుంబా క్షేత్రం లో వాటా పై శ్రద్ధ చూపిస్తుంది. ఇటీవలే  బి పి సి ఎల్ విదేశీ సంస్థ అయిన భారత్ పెట్రో రిసర్వ్స్ ఇక్కడ గ్యాస్  కనుగొన్నది. ఇందులో నామ మాత్రపు వాటా కు కూడా సిద్దం అని గెయిల్ తెలిపింది. దీనిద్వార ప్రస్తుతం గ్యాస్ పంపిణిలో ఉన్న గెయిల్ ఉత్పత్తిలోకి ప్రవేశించినట్లవుతుంది.

తమతో భాగస్వామ్యం వల్ల మౌలిక సదుపాయాలు వేగంగా సమకూర్చుకోవచ్చని మరియు భారత్ కు గ్యాస్ పంపిణి చేయడానికి LNG ద్రవీకరణ సదుపాయం నిర్మించవచ్చని గెయిల్ తెలిపింది. దీనితో బి పి సి ఎల్ త్వరగా లాభాలు పొందవచ్చని తెలిపింది.

   

గెయిల్ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు

గెయిల్ ఉత్తర మరియు మధ్య భారత దేశం లో350  మెగా వాట్ల సామర్ధ్యం కల రెండు గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు నిర్మించాలని యోచిస్తుంది. పర్యావరణ పై వీటి ప్రభావం అంచనా వేయటానికి కన్సల్టెంట్స్ ను టెండర్ ద్వారా ఆహ్వానించింది.  ఈ ప్లాంట్లు ఉత్తరభారతదేశంలో దిబియపూర్ వద్ద మరియు మధ్య భారతదేశం లోని విజయపూర్ వద్ద నిర్మించవచ్చు. అన్నికయినా కన్సల్టెంట్స్ రెగ్యులేటర్ అనుమతి పొందడంలో కూడా సహాయపడతారు . గెయిల్ గ్యాస్ , విండ్ మరియు సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తుందని బి.సి త్రిపాఠి గతలో అన్న విషయం తెలిసిందే.

 

రాజస్తాన్ చమురు క్షేత్రం లో 10 శాతం రాబడి పొందనున్న ఒ ఎన్ జి సి

రాజస్తాన్ ఆయిల్ క్షేత్రం లో  ఒ ఎన్ జి సి పెట్టుబడి పై కనీసం 10 శాతం రాబడి (ROI) వచ్చేవిదంగా ప్రబుత్వం అంగీకరించింది. దీనివలన ఒ ఎన్ జి సి లాభాలు మరియు షేర్ ధర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలు లో ఉన్న ఒప్పందం ప్రకారం కేర్న్ మరియు ఒ ఎన్ జి సి భాగాస్వాములైనప్పటికి, మొత్తం రాయల్టీ ఒ ఎన్ జి సి బరిస్తూ ఉంది. దీనివలన ఒ ఎన్ జి సి, ఈ పెట్టుబడులపై  నష్టాలు చవి చూసింది. ప్రబుత్వం ఒ ఎన్ జి సి లో షేర్లు అమ్మే ప్రస్తావన మరియు కేర్న్-వేదాంతా అమ్మకపు ఒప్పందాలు తెలిసినవే. ఈ అంశాల ఆధారంగా ఒ ఎన్ జి సి తన నష్టాలు తగ్గించవలసిన ఆవశ్యకతను ప్రబుత్వం కు తెలిపింది. దీని వలన పెట్రోలియం శాఖా రాజస్తాన్ క్షేత్రం నుండి వచ్చే కొంత లాభం  ఒ ఎన్ జి సి కి చెల్లించాలని నిర్ణయించింది.  అయీ ఇది సబ్సిడి పరిగణలోకి వస్తున్నందున, ఆర్ధిక శాఖా మంత్రి ఆమోదం పొందవలసి ఉంది.

   

Page 1 of 2

లాగిన్